AP Spouse Pension 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం అనేక మంది మహిళలకు జీవితంలో ఒక కొత్త ఆశను నింపుతోంది. భర్తను కోల్పోయిన మహిళలకు నెలకు రూ.4000 పింఛన్ మంజూరు చేస్తూ స్పౌజ్ కేటగిరీ కింద 71,380 మంది లబ్ధిదారులను చేర్చారు. ఈ పింఛన్లు NTR భరోసా పథకం లో భాగంగా అమలులోకి వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి జారీ అయిన ఉత్తర్వుల ప్రకారం, ఈ పింఛన్లు జూన్ 12, 2025న లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి.

స్పౌజ్ కేటగిరీ అంటే, భర్త పింఛన్ తీసుకుంటున్న సమయంలో ఆయన మరణిస్తే, ఆయనే తీసుకుంటున్న పింఛన్ను భార్యకు కొనసాగించడం. ఇది గతంలో నవంబర్ 2024లో ప్రారంభమై, ఇప్పటివరకు ఎన్నో కుటుంబాలకు బాసటగా నిలిచింది. ఇప్పుడు మరో 71 వేల మందికి ఈ ప్రయోజనం చేరనున్నది అనడం నిజంగా ప్రశంసనీయ నిర్ణయం.
For more updates join in our whatsapp channel
అర్హత పొందాలంటే కొన్ని డాక్యుమెంట్లు తప్పనిసరిగా అవసరం. వాటిలో ప్రధానమైనవి భర్త మృతిని నిరూపించే ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, గ్రామ లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత, వారి ఖాతాల్లో నెలవారీగా పింఛన్ చేరుతుంది. లేదా ప్రతి నెలా సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తారు.
ఇంకా చెప్పాలంటే, ఈ నిర్ణయం రాష్ట్ర ఖజానాపై రూ.35 కోట్ల అదనపు భారం వేసినప్పటికీ, ప్రభుత్వం మాత్రం సంక్షేమానికి ఎలాంటి తగ్గుదల లేకుండా ముందుకు సాగుతోంది. ఇదే రోజున “తల్లికి వందనం” పథకాన్ని కూడా ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15న మహిళలకు RTC ఉచిత ప్రయాణం కూడా అమలులోకి రానుంది.
ఈ నిర్ణయంతో భర్తను కోల్పోయిన అనేక మంది మహిళలకు ఆర్థిక భద్రత ఏర్పడనుంది. అలాంటి సమయంలో ప్రభుత్వ మద్దతు అనేది జీవితంలో ఒక మానసిక బలాన్ని కూడా కలిగిస్తుంది. అర్హులైన వారు తక్షణమే అవసరమైన డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే మీ అభిప్రాయాలను మరియు సందేహాలను కామెంట్ చేయండి.
FAQs:
భర్త మృతి ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, సచివాలయంలో దరఖాస్తు చేయాలి.
జూన్ 12, 2025న మొదటి విడతగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుంది.
ప్రతి మహిళకు నెలకు రూ.4000 చొప్పున పింఛన్ లభిస్తుంది.
ఇప్పటికే పింఛన్ పొందుతూ మరణించిన భర్తల భార్యలకు ఈ పథకం వర్తిస్తుంది.

భర్త చనిపోయి ఆ కుటుంబంలో వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న వారు ఉన్నారని వితంతు పెన్షన్ ఇవ్వడం లేదు గత రెండు సంవత్సరముల నుంచి వైసీపీ గవర్నమెంట్ వితంతుకి పెన్షన్లు రాయలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా కొత్త పెన్షన్లు మొదలు పెట్టలేదు వారు ఎలా బ్రతుకుతారు